ఆయుర్వేద ఆమోద జీవోపై డాక్టర్ల నిరసన
ఈ మేరకు శుక్రవారం దేశ వ్యాప్త నో-డిమోనిస్ట్రేషన్ స్ట్రైక్కు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్లను మోడ్రన్ మెడిసన్ సర్జరీలు చేసేలా అనుమతించే నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సర్వీసులకు అంతరాయం కలిగింది. అసోంలోనూ ఎమర్జెన్సీ, కోవిడ్ కేర్ సర్వీసులను మినహా ఇతర వైద్య సర్వీసులు కొంత మేర నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు నల్ల రిబ్బన్లు ధరించి డ్యూటీలో సమ్మె పాటించారు.
ఇదిలా ఉంటే ఆయుర్వేద పట్టభద్రులను ఆపరేషన్లు చేసేందుకు అనుమతిస్తే దేశంలోని ఆరోగ్య పరిరక్షణ రంగంలో అవినీతి చోటుచేసుకుంటుందంటూ ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ వ్యాఖ్యానించారు. ఇది వైద్య విధానంలోనే అతి పెద్ద తప్పుగా చరిత్రలో మిగిలిపోతుందని, ఆరోగ్యంపై దేశం రాజీపడితే అదొక పెద్ద వైఫల్యమవుతుందని హెచ్చరించారు. వైద్యుడు కావాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుందని, అలా కాకుండా ‘మిక్సోపతి’ని అనుమతించి కేంద్రం ఏమి ఆశిస్తుందో తమకు అర్థం కావడం లేదని చెప్పారు.