బ్రేకింగ్: ప్రముఖ వ్యాపారవేత్త, మసాలా దిగ్గజం మృతి
1923 లో పాకిస్తాన్ లోని సియాల్కోట్ లో జన్మించారు. స్కూల్స్ మానేసిన ఆయన చిన్న వయసులోనే తండ్రి చేస్తున్న మసాలా వ్యాపారంలో అడుగు పెట్టారు. 1947 లో దేశ విభజన తరువాత, ధరంపాల్ గులాటి భారతదేశానికి వచ్చి... అమృత్సర్ లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక దుకాణాన్ని ప్రారంభించారు. గులాటి ఈ సంస్థను అధికారికంగా 1959 లో స్థాపించారు. ఇతర దేశాల్లో కూడా ఈ సంస్థ వ్యాపారాలు ఉన్నాయి.