బ్రేకింగ్: ప్రముఖ వ్యాపారవేత్త, మసాలా దిగ్గజం మృతి

ఎండిహెచ్ మసాలా యజమాని ధరంపాల్ గులాటి గురువారం ఉదయం కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. 97 ఏళ్ళ గులాటి గత మూడు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది అని వైద్యులు పేర్కొన్నారు. 'దలాజీ' మరియు 'మహాషైజీ' అని ఆయనను గౌరవంగా పిలుస్తారు.
1923 లో పాకిస్తాన్ లోని సియాల్‌కోట్‌ లో జన్మించారు. స్కూల్స్ మానేసిన ఆయన చిన్న వయసులోనే తండ్రి చేస్తున్న మసాలా వ్యాపారంలో అడుగు పెట్టారు. 1947 లో దేశ విభజన తరువాత, ధరంపాల్ గులాటి భారతదేశానికి వచ్చి... అమృత్సర్‌ లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌ లో ఒక దుకాణాన్ని ప్రారంభించారు.  గులాటి ఈ సంస్థను అధికారికంగా 1959 లో స్థాపించారు. ఇతర దేశాల్లో కూడా ఈ సంస్థ వ్యాపారాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: