టపాసులు పేలి బీజేపీ ఎంపీ మనవరాలు మృతి..!

N.ANJI
దీపావళి పండుగ రాజకీయ నాయకుడి ఇంట విషాదం నింపింది. టపాసుల కాల్చుతూ ప్రమాదానికి గురైన బీజేపీ ఎంపీ మనుమరాలు ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణా జోషి మనుమరాలు (6) దీపావళి రోజున టపాసుల కాల్చుతూ ప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో చిన్నారి శరీరం కొంతమేరకు కాలిపోయింది. గాయపడిన ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది.
రీటా బహుగుణ కుమారుడు మయంక్ జోషి కుమార్తె దీపావళి రోజు రాత్రి తన ఇంటిపై కొంత మంది పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురయ్యింది. చిన్నారి దుస్తులకు మంటలు అంటుకోవడంతో బిగ్గరగా ఏడ్చినా టపాసుల శబ్దానికి అవి ఎవరికీ వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత పాప కాలిపోతున్న విషయాన్ని ఎవరో గమనించారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఆ బాలికను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆ బాలికను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని మిలటరీ ఆసుత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: