పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు భారత్ ఎల్లప్పుడూ ప్రయత్నించిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు సైనికులు అత్యున్నత త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఎప్పటికప్పుడు తలెత్తాయని వ్యాఖ్యానించారు.డార్జిలింగ్, సున్కాలోని ఇండియన్ ఆర్మీ 33 కార్ప్స్ సైనికులను ఉద్దేశించి రాజ్నాథ్ ప్రసంగించారు. అంతకుముందు అత్యున్నత సమావేశంలో పాల్గొన్న ఆయన.. సిక్కిం సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద పహారా కాసే కార్ప్స్ 33 యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
బంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్నాథ్ సింగ్ ఈ సైనిక శిబిరాన్ని శనివారం సందర్శించారు. లద్దాఖ్లో సైనిక ప్రతిష్టంభన మధ్య ఆర్మీ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించడం సహా.. సైన్యంతో దసరా సంబరాలు చేసుకోనున్నారు రాజ్నాథ్. సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె సైతం రాజ్నాథ్ వెంటవచ్చారు.
మరింత సమాచారం తెలుసుకోండి: