ఉద్యోగరీత్యా సోమాలియాకు వెళ్లిన 33 భారతీయులను అక్కడి కంపెనీ నిర్భందంలో ఉంచింది. వారిని తిరిగి భారత్కు తీసుకురావడానికి సర్వదా ప్రయత్నిస్తున్నామని కెన్యాలోని భారత హైకమిషన్ తెలిపింది. అందుకుగాను సోమాలియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. వీలైనంత త్వరలో వారిని భారత్కు తీసుకుని వస్తామని ప్రకటించింది.కంపెనీ చెరలో చిక్కుకున్న 33 మందిలో 25 మంది ఉత్తర్ప్రదేశ్కు, ఆరుగురు బిహార్కు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అదే కంపెనీలో పని చేస్తున్న కార్మికుడు ఈ మధ్యనే భారత్కు తిరిగి వచ్చాడు. అక్కడి వారి బాధలను వీడియోలో చిత్రీకరించి మానవ సేవా సంస్థాన్ అనే ఎన్జీవోకు చూపించాడు. దీంతో రాజేశ్కుమార్ అనే ఎన్జీవోకు చెందిన వ్యక్తి భారత హైకమిషన్, విదేశాంగ శాఖను మెయిల్, ట్విట్టర్ ద్వారా సంప్రదించారు. వారి దుస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన హైకమిషన్ తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: