మరో సారి తెరపైకి ఆర్టికల్ 370.. చైనా కి ఇబ్బంది..!
చైనా అధ్యక్షుడిని ప్రధాని మోదీ.. భారత్కు ఆహ్వానించి ఆయనతో కలిసి ఊయల కూడా ఊగారని ఫరూక్ అబ్దుల్లా ఘాటు విమర్శ చేశారు. అంతటితో ఆగకుండా చైనా అధ్యక్షుడితో చెన్నైలో భోజనం చేశారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగీకారయోగ్యం కాదని ఫరూక్ వ్యాఖ్యానించారు.