లాక్ డౌన్ లో హల్ చల్ చేసిన తబ్లిగీ జమాత్ సభ్యులు విడుదల..!
వారంతా మలేసియా, బ్రిటన్, నెదర్లాండ్, జాంబియా, కరేబియన్ దీవులకు చెందిన వారుగా అధికారులు తెలిపారు. మలేసియాకు చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వెల్లడించారు.లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్కు హాజరై, మసీదులో దాగున్నారని మార్చి 30న రాంచీలోని హింద్పిటిలో వారిని అరెస్టు చేశారు పోలీసులు. కేసును విచారించిన న్యాయస్థానం మూడునెలలు శిక్షతో పాటు జరిమానా విధించింది.