ఈరోజు సరిహద్దుల్లో రాజ్​నాథ్ సరి కొత్త రికార్డ్.. అది ఏంటి అంటే..?

Lokesh
జమ్ముకశ్మీర్​​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​లోని సరిహద్దు ప్రాంతాలలో నిర్మించిన 43 వంతెనలను.. గురువారం జాతికి అంకితమివ్వనున్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భద్రతా దళాలు, ఆయుధాల తరలింపునకు ఈ వంతెనలు సహాయపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఈ 43లో 7 వంతెనలు లద్దాఖ్​లో నిర్మించినవే కావడం విశేషం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో ఈ బ్రిడ్జీలు అందుబాటులోకి రావడం భారత్​కు కలిసివచ్చే విషయం.
మిగిలిన వాటిల్లో.. 10 వంతెనలు జమ్ముకశ్మీర్​, రెండు హిమాచల్​ప్రదేశ్​, 8 ఉత్తరాఖండ్​, 8 అరుణాచల్​ప్రదేశ్​, నాలుగు సిక్కిం, నాలుగు పంజాబ్​లో ఉన్నాయి. వీటితో పాటు అరుణాచల్​ ప్రదేశ్​ తావాంగ్​లోని నిచిఫు టన్నెల్​కు రాజ్​నాథ్​ శంకుస్థాపన చేస్తారని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: