జగనన్న తిరుమల టూర్ ఇదే...!

సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఖరారు అయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకుంటారు. రోడ్డు మార్గాన తిరుమలకు సీఎం వస్తారు. పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సిఎం.
రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో పాల్గొనున్నారు సీఎం. 24న ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకుంటారు సీఎం. 24న ఉదయం 7 నుంచి 8 వరకు సుందరకాండ పఠనంలో  సిఎం పాల్గొంటారు. 24న ఉదయం 8.10కి కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 24న రాత్రి 10.20కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరతారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: