ఎల్​ఏసీ పై నేడు కీలక ప్రకటన విడుదల చేయనున్న రాజ్​నాథ్..!

Lokesh
తూర్పు లద్దాఖ్​లో భారత్, చైనా సైన్యం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అంశంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఇవాళ పార్లమెంట్​లో ఓ ప్రకటన చేయనున్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితిపై లోక్​సభకు పలు విషయాలు వివరించే అవకాశం ఉంది.రష్యా పర్యటనలో రాజ్​నాథ్ సింగ్​ ఇదివరకే చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగేతో సమావేశమయ్యారు.

 మరోవైపు మంత్రి జైశంకర్ సైతం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. అటు.. ఈ విషయంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో రాజ్​నాథ్ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.మరోవైపు కేంద్ర కేబినెట్​, ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ సమిటీలు ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: