నీ చుట్టూ గొడవలు నువ్వు చెప్పేది నీతులు.. ఇండియా పై చిన్న చూపు
అఫ్గానిస్థాన్లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంలో ఎదురవుతున్న భద్రతా సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగినట్లు రక్షణమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. షాంఘై సహకార మండలి ఎస్సీఓలో పర్షియన్ గల్ఫ్ పరిస్థితుల పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత రాజ్నాథ్ సింగ్ ఇరాన్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో ఇరాన్, అమెరికా, యూఏఈ మధ్య పర్షియన్ గల్ఫ్లో జరిగిన వరుస సంఘటనలు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పురిగొల్పాయి. పర్షియన్ గల్ఫ్ దేశాలు భారత్కు మిత్రదేశాలగా అభివర్ణించిన రాజ్నాథ్ సింగ్... సమస్యలను స్వేహ పూర్వకంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, ఒకరి అంతర్గత వ్యవహారాలలో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని రాజ్నాథ్ సూచించారు.