ప్రముఖ హోటల్​పై ఉగ్రవాదులు దాడి.. ఒక్క సారిగా తూటాల వర్షం

Lokesh
సోమాలియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజధాని మొగధిషులో బీచ్ పక్కన ఉన్న ప్రముఖ ఎలైట్ హోటల్పై దాడికి తెగబెడ్డారు. సెక్యూరిటీ గేట్లను బాంబులతో ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. ప్రశాంతంగా బస చేస్తున్న అమాయకులపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సోమాలియా పోలీసులు తెలిపారు.కనీసం 20మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో యువకులు, మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.

గత కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న సోమాలియాలో ఈ ఘటనతో మళ్లీ అశాంతి నెలకొంది. హోటల్ పై దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ అతివాద రెబల్స్, అల్​ఖైదా అనుబంధ అల్-శబాబ్ ప్రకటించింది.కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలో కూడా ఉగ్ర దాడులు ఆగలేదు అంటే ప్రపంచం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఒకవైపు కరోనా ను  నిర్మూలించడానికి వ్యాక్సిన్ తయారీలో ప్రపంచమంతా అనేక పాట్లు పడుతుంటే ఈ సమయంలో కూడా ప్రజలను పెట్టడానికి ఉగ్ర దాడులు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: