చెలరేగిపోతున్న పాకిస్తాన్... బంకర్లలో సరిహద్దు గ్రామాలు

భారత్ పాక్ సరిహద్దుల్లో భారత అర్మీని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులకు దిగుతుంది. పాక్ ఆర్మీ వరుసగా కాల్పులు జరపడంతో భారత బలగాలు కూడా అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తున్నాయి. మంజకోట్ సెక్టార్‌లో రాత్రి 10:20 గంటలకు, కేరీ సెక్టార్‌లో రాత్రి 10:40 గంటలకు, బాలకోట్ సెక్టార్‌లో రాత్రి 10:30 గంటలకు, కరోల్ మైత్రన్‌లో 10:50 గంటలకు పాక్ కాల్పులు జరిపింది. 

 

ఈ కాల్పులను భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పి కొడుతుంది. అయితే ఇప్పుడు భారత వైపు సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు ప్రజలు బంకర్ల లో దాక్కుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ దాడుల్లో పశువులు కూడా మరణిస్తున్నాయి అని ఇళ్ళు కూడా నాశనం అవుతున్నాయి అని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: