పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న ఇండియన్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో భారత బలగాలపై పాకిస్తాన్  కాల్పులు జరుపుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి గత పది రోజులుగా పాక్ తూట్లు పాడుతూనే ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పలు చోట్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. 

 

మంజకోట్ సెక్టార్‌లో రాత్రి 10:20 గంటలకు, కేరీ సెక్టార్‌లో రాత్రి 10:40 గంటలకు, బాలకోట్ సెక్టార్‌లో రాత్రి 10:30 గంటలకు, కరోల్ మైత్రన్‌లో 10:50 గంటలకు పాక్ తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరపగా భద్రతా దళాలు కూడా అదే స్థాయిలో స్పందించి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మరో పక్క రాష్ట్రంలో ఉగ్రవాదులను కూడా భారత ఆర్మీ ఏరేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: