షాకింగ్: 9 మంది వైద్యులను కాల్చి చంపేశారు

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా వైద్యులకు దండం పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది కొన్ని దేశాల్లో వైద్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా సోమాలియా లో ఉగ్రవాద గ్రూపులు 9 మంది వైద్యులను కాల్చి చంపడం సంచలనంగా మారింది. సోమాలియా ప్రాంతానికి చెందిన అల్ షబాబ్ ఉగ్రవాదులు 9 మంది వైద్యులను అపహరించి వారిని కాల్చి చంపేశారు. 

 

మధ్య షాబెల్లీ ప్రావిన్సు బలాద్ నగరంలో వారి శవాలను గుర్తించారు అధికారులు. వారు అంతా కూడా యువ వైద్యులే అని సమాచారం. స్థానిక ఆస్పత్రుల్లో వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఆ దేశంలో కరోనా తీవ్రత ప్రస్తుతం తక్కువగానే ఉంది. ఈ ఘటనతో అక్కడ వైద్యులు భయపడే పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: