బిగ్ బ్రేకింగ్: ఆప్ ఎమ్మెల్యేకు, అతని సోదరుడికి కరోనా..
ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యే విశేష్ రవి, అతని సోదరుడు కరోనా వైరస్ బారినపడ్డారు. వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలడంతో కలకలం రేగుతోంది. కరోల్ బాగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే విశేష్ రవికి బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో అతనికి పాజిటివ్ అని వచ్చింది. అయితే.. ఎమ్మెల్యేలో ఇప్పటివరకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. *నేను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. నాకు కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేవు. కానీ నేను వైరస్ బారిన పడ్డాను. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది* అంటూ ఆయన వాపోయారు.
అయితే.. ఎమ్మెల్యే విశేష్ రవి వలస కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వారి కష్టాలను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారినపడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. దీంతో ఆయన ఎవరెవరితో కలిశారు..? వారంతా ఎక్కడెక్కడ ఉన్నారు..? తదితర అంశాలను సేకరించే పనిలో అధికారులు పడ్డారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 3,515కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.