దేవుడా దయచూడు: రెండు రోజుల బిడ్డ తల్లికి కరోనా
ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారితో విల విలలాడుతుంది. ఎక్కడ చూసినా మరణాలకు సంబంధించిన వార్తలు.. కరోనా కేసుల గురించే చర్చలే నడుస్తున్నాయి. ఈ మాయదారి కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కనీ చావుదాకా తీసుకు వెళ్తుతుంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల నెలల పసిపాప కూడా సోకుతుంది. కొంత మంది చిన్నారు చనిపోయారు. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ విషాదం చోటు చేసుకుంది.
2 రోజుల క్రితం సదర్ ఆసుపత్రిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మహిళకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటీవ్ అని తేలింది.ఆ రెండు రోజుల పసిపాప పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె బిడ్డను రిమ్స్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చారు.
ప్రస్తుతం సదర్ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ట్రీట్ మెంట్ నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో భారత్లో 991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 24 గంటల్లో మొత్తం 43 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
A woman who had delivered a baby 2 days ago at Sadar Hospital, tested positive for #COVID19 yesterday, her child has been admitted to the isolation ward at RIMS hospital. The Sadar Hospital staff that had attended the woman will now undergo tests: Ranchi Administration #Jharkhand pic.twitter.com/Y22Fd89LqT — ANI (@ANI) April 18, 2020
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple