సన్నగా వున్నవారు ఈ డ్రింక్ తో ఫిట్ గా అందంగా అవ్వొచ్చు!

Purushottham Vinay
నిజానికి అధికంగా బరువు ఉండడం కంటే.. బరువు తక్కువగా ఉండడం వల్లే చాలా ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో పోషకాహార లోపాలు ఎక్కువగా వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. తరచూ జబ్బుల బారిన కూడా పడుతూ ఉంటారు.ఇక బరువు తక్కువగా ఉండడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వయస్సుకు తగినంతగా బరువును కచ్చితంగా కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఆరోగ్యంగా ఇంకా అందంగా ఉంటారు. ఇక బరువు పెరగడానికి బయట దొరికే టానిక్ లను ఇంకా పౌడర్ లను వాడడానికి బదులుగా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం తొందరగా బరువును పెరగవచ్చు. మన వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలతో ఓ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా బరువుని పెరగవచ్చు.బరువు పెరగడానికి ఉపయోగపడే ఈ డ్రింక్ ను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక దీని కోసం ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు ఎండు ద్రాక్షను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పొడిని వేసి అందులోనే బాగా కాచి చల్లార్చిన పాలను పోసి కలిపి.. రాత్రంతా కూడా నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న ఎండు ద్రాక్ష ఇంకా పాల మిశ్రమాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నేరుగా తినవచ్చు లేదా జార్ లో వేసి మిక్సీ పట్టి డ్రింక్ లా చేసుకుని కూడా తాగవచ్చు. ఇక ఇలా చేయడం వల్ల చాలా తొందరగా బరువు పెరుగుతారు.అలాగే పిల్లలకు కూడా దీనిని నేరుగా ఆహారంగా ఇవ్వవచ్చు లేదా ఏదైనా పండును కలిపి మిక్సీ పట్టి స్మూతీలా చేసి కూడా ఇవ్వవచ్చు. ఇంకా ఇందులో జీడిపప్పు పొడికి బదులుగా ఇతర డ్రై ఫ్రూట్స్ ను కూడా పొడిగా చేసి కూడా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్షలు ఇంకా జీడిపప్పులలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరగడంలో చాలా ఎక్కువగా సహాయపడతాయి. వీటితోపాటు ప్రోటీన్లు ఇంకా పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న డ్రింక్ ను తాగడం వల్ల కండ పుష్టి కోసం వ్యాయామాలు చేసే వారు కూడా ఈజీగా మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: