దేశంలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు?

Purushottham Vinay
ఇక ఇండియాలో ఆటోమొబైల్ అమ్మకాలు చాలా వేగంగా పెరిగినట్లు సమాచారం తెలుస్తుంది. ఫిబ్రవరి నెలలో మొత్తం వాహనాల అమ్మకాల వార్షికంగా 16 శాతం పెరిగింది. అంటే, ఫిబ్రవరి 2022 నెలతో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 16 శాతం దాకా వాహనాలు అనేవి అమ్ముడవ్వడం జరిగింది.ఫిబ్రవరి 2023 లో మొత్తం 17,75,424 వాహనాలు అమ్మకానికి నమోదయ్యాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) సోమవారం నాడు ఈ విషయాన్ని తెలిపింది. ద్విచక్ర వాహనాలు ఇంకా అలాగే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా అలాగే అంతకుముందు సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొత్తం 15,31,196వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దాదాపు రెండున్నర లక్షల వాహనాలు అమ్ముడుపోవడం జరిగింది.ఇక ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఈ ఫిబ్రవరి నెలలో మొత్తం 2,87,182 వాహనాలు అమ్ముడయ్యాయి.


గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈసారి 11 శాతం ఎక్కువ.ద్విచక్ర వాహనాల అమ్మకాలు మొత్తం 15 శాతం పెరిగింది.ఫిబ్రవరి నెలలో మొత్తం 12,67,233 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోవడం జరిగింది.ఇక ద్విచక్ర వాహనాలు 2022 కంటే ఎక్కువ శాతం పెరగనున్నాయి.ఇక 15 శాతం ఎక్కువ అమ్మకాలు కనిపించినప్పటికీ, కోవిడ్‌కు ముందు ఉన్న దృష్టాంతంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పాలి. అంటే ఫిబ్రవరి 2020లో మొత్తం 14 శాతం ద్విచక్ర వాహనాలు విక్రయాలు అనేవి జరిగాయి.ఇక రానున్న పండుగల సీజన్‌తో వాహనాల విక్రయాలు అనేవి మరింత ఊపందుకోనున్నాయి . మార్చి, ఏప్రిల్‌ నెలలో ప్రజలు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని ఆటోమొబైల్ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు.కానీ ఈ రోజుల్లో అయితే ప్రజలు పెద్దగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. వారు కేవలం డబ్బు పొదుపుపై ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అందువల్ల కార్ల విక్రయాల జోరుకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: