సుజుకి ఇంట్రూడర్ 150: నిలిచిపోయిన అమ్మకాలు!

Purushottham Vinay
ప్రముఖ బైక్ ఇంకా అలాగే స్కూటర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' (Suzuki Motorcycle India) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఇక ఈ కంపెనీ దేశీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల తన క్రూయిజర్ బైక్ ను ఇండియన్ మార్కెట్లో కంపెనీ నిలిపివేసింది. అసలు ఈ బైక్ నిలిపివేయడానికి గల కారణం ఏంటి అనే పూర్తి విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.ఈ సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి భారతీయ మార్కెట్లో ఉన్న ఒకే ఒక క్రూయిజర్ బైక్ ఈ 'సుజుకి ఇంట్రూడర్ 150' (Suzuki Intruder 150). అయితే ఉన్న ఆ ఒక్క క్రూయిజర్ బైక్ ని కూడా ఇలా నిలిపివేయడానికి ప్రధాన కారణం దీని అమ్మకాలు సరిగ్గా లేకపోవడమే. ఈ కారణంగానే సుజుకి కంపెనీ తన వెబ్‌సైట్ నుండి ఈ బైక్‌ను తొలగించింది. ఇక అంతే కాకుండా దీని బుకింగ్‌లను కూడా నిలిపివేసింది.ఇక సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఇంట్రూడర్ 150 బైక్ నిలిపివేత గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల చేయలేదు.


కంపెనీ ఈ బైక్ ఉత్పత్తిని 2017 వ సంవత్సరంలో భారతీయ విఫణిలో ప్రారంభించింది. ఆ తరువాత బిఎస్ 6 నిబంధనలకు అనుకూలంగా 2020 వ సంవత్సరంలో అప్డేట్ చేసింది. అయితే కంపెనీ ఈ బైక్ లో ఎన్ని అప్డేట్స్ చేసినప్పటికీ కూడా మొదటినుంచి చాలా తక్కువ అమ్మకాలను మాత్రమే ఇది నమోదు చేస్తూనే ఉంది. ఇక ఈ కారణంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఈ సుజుకి ఇంట్రూడర్ 150 భారతదేశంలో రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో కంపెనీ విక్రయించింది. ఇక ఈ బైక్ మార్కెట్లో ప్రధానంగా బజాజ్ కంపెనీ అవెంజర్ 160 కి ప్రత్యర్థిగా ఉండేది. అయితే ఈ బజాజ్ అవెంజర్ 160 మొదట నుంచి కూడా సుజుకి ఇంట్రూడర్ 150 కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగడం జరిగింది. మొత్తం మీద ఎక్కువ అమ్మకాలు పొందని ఈ ఇంట్రూడర్ 150 ఇప్పుడు నిలిచిపోవడానికి సిద్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: