కుషాక్ డెలివరీలను స్టార్ట్ చేసిన స్కోడా..

Purushottham Vinay
ఇండియా మార్కెట్లో స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీని ఇటీవల కాలంలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక కార్ విడుదలైన సమయంలోనే కంపెనీ బుకింగ్స్ ని ప్రారంభించడం మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం కంపెనీ ఎస్‌యూవీ డెలివరీలు స్టార్ట్ అయ్యాయి. ఇక దీని గురించి పూర్తి సమాచారం విషయానికి వస్తే..ఇక స్కోడా కంపెనీ కుషాక్ 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్‌ను మాత్రమే డెలివరీ చేస్తున్నట్లు తెలిపడం జరిగింది.అయితే కుషాక్ కార్ 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ ను ఆగస్టు మొదటి వారంలో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది.ఇక ఈ ఎస్‌యూవీ కార్ ను కొనుగోలు చెయ్యాలనుకునే  కస్టమర్లు రూ. 25 వేలు చెల్లించి, డీలర్‌షిప్ లో మాత్రమే కాకుండా కంపెనీ యొక్క ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా కార్లని ఈజీగా బుక్ చేసుకోవచ్చు.ఇక ఇండియాలో విడుదలయిన ఈ కుషాక్ కార్ ఇప్పటికే చాలామంది కస్టమర్లను ఆకర్షించగలిగింది.

ఈ కారణంగా ఈ ఎస్‌యూవీ కుషాక్ కార్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కుషాక్ ఎస్‌యూవీ కార్ విడుదలైన కేవలం 7 రోజుల్లోనే 2 వేల యూనిట్ల బుకింగ్‌లను అందుకోవడం విశేషం.ఇక స్కోడా కుషాక్ స్టార్టింగ్ ధర వచ్చేసి ఇండియన్ మార్కెట్లో రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, దీని టాప్ వేరియంట్‌ ధర వచ్చేసి రూ. 17.60 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది.ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన స్కోడా కుషాక్ ఎస్ యూవీ కార్ హ్యుందాయ్ క్రెటా ఇంకా కియా సెల్టోస్‌ వంటి వాటికీ పోటీగా ఉంటుంది.ఇక స్కోడా కుషాక్ కార్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ ఇంకా స్టైల్ వేరియంట్లు. ఇవి రెండు కూడా పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడతాయి. అవి 1.0-లీటర్ ఇంకా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ ఇంకా డిఎస్జి గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంచబడటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: