ఇండియాలో విడుదల కానున్న ఎలెక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Satvika
భారత దేశ ఇప్పుడు ఎలెక్ట్రిక్ స్కుటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి.గత కొన్ని రోజులుగా దేశంలో ఈ-వెహికిల్స్ వినియోగం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. పెట్రోల్, డీజిల్ ధర తో పాటు కాలుష్యం పెరుగుతుండటంతో ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ సంస్థలు సైతం ఎలక్ట్రికల్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే బజాజ్, టీవీఎస్ కంపెనీలు భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. వీటితో పాటు హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

ఇకపోతే టాప్ కంపెనీ అయిన హీరో మొదటి స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచన లో ఉంది.కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను వచ్చే ఏడాది ప్రారంభం లో విడుదల చేసే అవకాశం ఉంది. తద్వారా, ఈ రంగంలో తనదైన ముద్ర వేయడానికి హీరో మోటో కార్ప్ సిద్దమవుతోంది. హీరో నుంచి విడుదల కానున్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ టూవీలర్ మాస్ట్రో ఎడ్జ్ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహన తయారీ పై ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ-స్కూటర్ ప్రస్తుతం జైపూర్లోని హీరో మోటోకార్ప్ ఆర్ అండ్ డి సెంటర్ (సిఐటి)లో సిద్ద మవుతోంది.

బైక్ నమూనాను గతడాది నిర్వహించిన హీరో వరల్డ్ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో ఐసి ఇంజన్-శక్తి తో కూడిన కౌంటర్ను ఇది పోలి ఉంటుందని అంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవ్, పార్క్, రివర్స్ ‌తో సహా మూడు రైడ్ మోడ్‌ల తో రూపొందించబడుతుంది. వీటిని లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేర్తో నియంత్రించవచ్చు.. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూవీలర్ భారత మార్కెట్లో బజాజ్, టివిఎస్, అథర్, ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాల తో పోటీ పడనుంది.. ఇక మరో ఏడాదిలో ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ ల హవా నడుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: