ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వారంతా మహిళలేనట..

Purushottham Vinay
ప్రపంచంలోనే మొదటి సారి ఒక స్కూటర్ తయారీ ఫ్యాక్టరీలో మొత్తం మహిళలే పని చేయబోతున్నారు.ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల తయారీ కోసం సిద్ధం చేసిన ''ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ'లో మొత్తం పది వేల మంది మహిళా ఉద్యోగులు మాత్రమే ఉంటారని ఆ కంపెనీ సీఈవో ఇంకా వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్‌ ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే మహిళలు మాత్రమే ఉండే అతి పెద్ద ఇంకా మొదటి ఆటోమోటివ్‌ కంపెనీగా ఓలా కంపెనీ కొత్త రికార్డు సృష్టించడం జరిగింది. ఇక మహిళలు కూడా ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భవిష్ తెలిపడం జరిగింది. ఇక ఇందుకు అవసరమైన నైపుణ్యాలును పెంచేందుకు అవసరమైన శిక్షణను ఇచ్చామని అలాగే ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రతి పనినీ వాళ్లే చేస్తారని చెప్పడం జరిగింది. ఇక మహిళలకు ఆర్థికంగా బలపడే అవకాశాలు పెరిగితే వాళ్ల జీవితాలతో పాటు కుటుంబాల పరిస్థితులు కూడా మెరుగుపడుతాయని వారు అన్నారు.

ఇక అంతే కాదు మొత్తంగా సమాజమే మారుతుందని చెప్పడం జరిగింది. ఇక మహిళలకు లేబర్ వర్క్స్‌లో ప్రయారిటీ పెంచితే ఇండియా జీడీపీ 27 శాతం పుంజుకుంటుందని ఇప్పటికే కొన్ని సర్వేల్లో తేలిందని భవిష్ తెలిపడం జరిగింది.ఇక ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరుతో రెండు వేరియంట్లలో ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సంవత్సరం జులై నెలలో మొదటి సారి వీటి బుకింగ్ ని ప్రారంభించడం జరిగింది.ఇక రూ.500 టోకెన్ అడ్వాన్స్‌ చెల్లించి ఆన్‌లైన్‌లో ఈ స్కూటీ బుక్ చేసుకోవచ్చని ప్రకటించిన తర్వాత కేవలం మొదటి 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ అనేవి రావడం జరిగింది. ఇక ఈ నెల 8 వ తేదీన ఈ సేల్‌ను ఆన్‌లైన్ వేదిక ద్వారానే ప్రారంభించాలని భావించినప్పటికీ సైట్‌లో టెక్నికల్ సమస్యలు అనేవి ఎక్కువగా రావడం వల్ల ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఈ-స్కూటర్‌లను కొనుగోలు చేసిన వాళ్లకు అక్టోబర్ నెల నుంచి డెలివరీలు అనేవి అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: