ఆడవాళ్ళలో ఇమ్మ్యూనిటిని పెంచే ఈ మూడు పదార్ధాల గురించి తప్పక తెలుసుకోండి.. !!
ఈ దినుసులని మీరు ఫుడ్ లో యాడ్ చేసినా పరవాలేదు, లేదా ఇలా ఒక కషాయం లా తయారు చేసినా పరవాలేదు.ఇంట్లో మహిళలు ఈ ఎనర్జీ బూస్ట్ తాగుతూ ఇంట్లో మీ కుటుంభ సభ్యులతో కూడా తాగించండి.ఈ కషాయం పేరే వామూ, మిరియాల కషాయం.వాము, మిరియాలు – రెండింటిలోనూ ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాక మిరియాల్లో ఉన్న విటమిన్ సీ, యాంటీ-ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన దగ్గు, జలుబు తో వచ్చే లక్షణాలకి చెక్ పెట్టవచ్చు. ముక్కు దిబ్బడ తగ్గించి గొంతులో గరగరని పోయేలా చేస్తుంది. వాము, ఇండైజెషన్ కీ, బ్లోటింగ్ కీ మంచి మందు. ఈ రెండూ కలిపి చేసే ఈ కషాయం ఈ సీజన్ లో ఎంతో అవసరం. అంతే కాక ఈ డ్రింక్ లో కొద్దిగా అల్లం కూడా కలుపుతాం. అల్లం వల్ల వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే.
ఈ కాషాయం కోసం ఒక అరంగుళం – అల్లం ముక్కఒక టీ స్పూన్ మిరియాల పొడి,ఒక టీ స్పూన్ వాము, అల్లం ఉంటే చాలు.ముదుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీరు తీసుకుని అందులో వాము, మిరియాల పొడి, అల్లం వేసి మూడు నిమిషాలు మరిగించండి.తర్వాత వడకట్టి, కావాలనుకుంటే కొద్దిగా తేనె కలుపుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోండి. దీన్ని అప్పుడే తాగేయవచ్చు, లేదా కొంచెం కొంచెం రోజంతా తాగవచ్చు.అంతేకాదు ఈ కాషాయం తాగడం వల్ల ఆడవాళ్లు సహజంగా బరువు కూడా తగ్గుతారు...