విజయం మీదే: ఈ 2 పదార్ధాలను మీకు దూరంగా పెట్టండి?

VAMSI
ప్రస్తుత కాలంలో జీవన శైలి ఎంతగానో మారింది. ముఖ్యంగా మనిషి అలవాట్లు, అభిరుచులు ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు పండగకో, పబ్బానికో కానీ స్వీట్లు తీపి పదార్థాలు, ప్రత్యేక వంటకాలు తినేవారు కాదు. కానీ ఇపుడా పరిస్థితి పూర్తిగా మారింది. నిత్యం ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మధుర పదార్దాలను హాయిగా ఆరగించవచ్చు. అందులోనూ కష్టపడి ఇంట్లో చేయాల్సిన పనిలేదు. మనకు ఏమాత్రం శ్రమ లేకుండా బయట ఏది కావాలంటే అది రకరకాల స్వీట్స్ బయట దొరుకుతున్నాయి. అలా స్వీట్స్ మాత్రమే కాదు బయట దొరికే ఆహార పదార్దాలకు బాగా అలవాటు పడ్డారు జనాలు.
కానీ పరిమితికి మించిన ఏ ఆహరం అయినా చాలా ప్రమాదం అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆహారం మితంగా తింటే ఔషదం, అతిగా తింటే విషం అన్నది సత్యం. అందుకే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తప్పక అవసరం.
*ఇంట్లో వండిన ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
*ఉప్పును కాస్త తక్కువ తినడమే మంచిది. కరెక్ట్ గా తిన్నా పర్వాలేదు. కానీ ఎక్కువగా మాత్రం తినరాదు.
*చక్కెర లేదా బెల్లంతో తయారు చేసిన వంటకాలను బాగా తగ్గించాలి. కాఫీలు, టీ లు పదే పదే తాగడం మానేయాలి.
*పిండి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వాటికి బదులుగా ఆకు కూరలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది బిపీలు, షుగర్లు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వ్యాధులు రావడానికి కారణం ఉప్పు, షుగర్ లాంటివి అధికంగా తీసుకోవడమే. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి.  అందుకే నేటి నుండి మీరు తినే ఎటువంటి ఫుడ్ అయినా ఉప్పు మరియు షుగర్ లు అధికంగా లేకుండా చూసుకోండి. లేదంటే అతి తక్కువ వయసులోనే ఈ  వ్యాధుల బారిన పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: