పానీపూరీని కనిపెట్టింది ద్రౌపది నా..? నిజమెంత.. ?
పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదిని కుంతి పరీక్షించాలి అనుకుందట.. మిగిలిన ఆలుగడ్డ కూర ను ఒక చపాతీ కి మాత్రమే సరిపోయే పిండిని ద్రౌపదికి అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలి తీర్చాలని చెప్పిందట.. అప్పుడు ద్రౌపది ఆ వస్తువులతో పానీపూరి తయారు చేసి ఆ ఐదుగురు ఆకలి తీర్చినదట.. అంత తెలివైన పనిచేసిన ద్రౌపది నీ చూసి కుంతి ఎంతగానో సంతోషించిందట.. ద్రౌపది పేరున పానీపూరి శాశ్వతంగా ఉండిపోతుంది దీవించిందట..
అయితే మరి కొందరి వాదన ఎలా ఉంది అంటే అసలు మహాభారతంలో పానీపూరి కి ఉపయోగించాల్సిన వస్తువులు ఉన్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు అలాంటిది కుంతి ఎలా ద్రౌపదిని పరిశీలిస్తుందని కొంతమంది అడుగుతున్నారు.. నిజానికి ఆలుగడ్డలను పోర్చుగీసు వారు కనిపెట్టారు మరి మహాభారత కాలంలో ఈ ఆలుగడ్డలు ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ అంతుపట్టని అంశం.. మహాభారత కాలపు ఆహారంలో రొట్టెల ప్రస్తావన ఎక్కడా లేదు మరి కుంతి ద్రౌపది కి ఈ టాస్క్ ఎలా ఇచ్చిందని మరో డౌట్.. నిజంగా పానీపూరి సృష్టికర్త ద్రౌపది అవునో కాదో తెలియదు కానీ గూగుల్ లో సెర్చ్ చేస్తే మాత్రం ఆమె పేరే వస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..