చింతపండు చట్నీ తిన్నారా ? ఎంత బాగుంటుందో తెలుసా ?
చింతపండు.. పుల్లగా ఉంటుంది. ఉప్పు.. చింతపండు కలిపి ముద్ద చేసి తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ? చింతపండు పులుపు అత్యద్భుతంగా ఉంటుంది. అంత పులుపు ఉన్న చింతపండు చట్నీని ఎప్పుడైనా తిన్నారా ? అసలు చింతపండు చట్నీ ఉంది అని మీకు తెలుసా ? అలాంటి ఈ చింతపండు చట్నీ ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు...
చింతపండు- నాలుగు రెబ్బలు,
ఎండుమిరప కాయలు- మూడు,
మినపపప్పు- మూడు చెంచాలు,
నువ్వులు- మూడు చెంచాలు,
ధనియాలు-2 చెంచాలు,
ఎండు కొబ్బరి పొడి- 2 చెంచాలు,
నూనె- చెంచా,
పంచదార- 2 చెంచాలు,
ఉప్పు తగినంత.
తయారీ విధానం..
ముందుగా చింతపండును నానబెట్టాలి. తర్వాత మినపపప్పు, నువ్వులు, ధనియాలు విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక బాణలిలో నూనెపోసి ఎండు మిర పకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో చింతపండు రసం, చింతపండు రెబ్బలు, మినపపొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టమున్నవాళ్లు తాలింపు పెట్టుకోవచ్చు. అంతే.. చింతపండు చట్నీ రెడీ.