తెలుగు వెబ్ మీడియా ప్రపంచంలో సంచ‌లనాలు ఈ ' కోటిరెడ్డి ' కే సొంతం...!

VUYYURU SUBHASH
ప్ర‌స్తుతం వెబ్ మీడియా రంగం దుకుడే వేరు. నిరంత‌రం.. ప్ర‌జ‌ల‌కు వార్త‌లు చేర‌వేయ‌డ‌మే విధిగా.. బ్రేకింగ్ న్యూస్‌ల‌తోపాటు.. సాధార‌ణ‌, పొలిటిక‌ల్ వార్త‌లు ఇవ్వ‌డంలో ఇత‌ర ప్ర‌ధాన వార్తా సంస్థ‌ల‌తో స‌మానంగా.. వెబ్ మీడియా దూసుకుపోతోంది. అయితే.. ఈ రంగంలోనూ త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న మార్పుల‌కు శ్రీకారం చుట్టారు.. కోటి గ్రూప్ అధినేత స‌రిప‌ల్లి కోటిరెడ్డి. అత్యంత పిన్న వయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కోటిరెడ్డి సరిపల్లి డిజిటల్ మీడియా రంగంలోనూ అద్భుతాలు సృష్టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అతి త‌క్కువ మందితో స్థాపించిన సంస్థ నేడు.. దేశ‌వ్యాప్తంగా అనేక భాష‌ల్లో విరాజిల్లుతుండ‌డం గ‌మ‌నార్హం.

'హెరాల్డ్ వసుధైక కుటుంబాన్ని' స్థాపించిన ( ఇండియా హెరాల్డ్ పోర్ట‌ల్లో ఆధ‌ర్స్‌, సిబ్బంది ఇదే పేరుతో పిలుస్తారు) స‌రిప‌ల్లి కోటిరెడ్డి.. అన‌తి కాలంలోనే వెబ్ మీడియా రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు. కార్డులు, బ్రేకింగ్ న్యూస్‌, స్క్రోలింగ్ (వెబ్ మీడియాలో కార్డు సిస్టం తొలిసారి అమ‌లు చేసిన  సంస్థ‌) వంటి అనేక కొత్త విష‌యాల‌ను, అంశాల‌ను జోడించి.. వెబ్ మాధ్య‌మానికి వ‌న్నెల‌ద్దారు.  ఎదగడం అంటే మనం ఒక్కరమే కాకుండా మనతో పాటు.... మన చుట్టూ ఉన్న వారు కూడా ఎదగడమే అని చెప్పే ఆయన ఎంతోమంది ఎదుగుదలలో భాగస్వామిగా మారారు.
కొత్తగా ఏదో ఒకటి చేయాలి కొత్త వారిని ప్రోత్స‌హించాలి.. అనే ల‌క్ష్యంతో కోటిరెడ్డి స‌రిప‌ల్లి అడుగులు వేస్తున్నారు. హెరాల్డ్ వ‌సుధైక కుటుంబంలోని ప్ర‌తి ఒక్క ఉద్యోగినీ.. తన కుటుంబ స‌భ్యులుగా భావిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఒక‌వైపు హెరాల్డ్ పోర్ట‌ల్‌ను స‌మున్న‌త స్థాయిలో నిర్వ‌హిస్తూనే మ‌రోవైపు సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌స్తూ.. వెబ్ ప్ర‌పంచంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు.

ఈ ప‌రిణామం.. సంస్థ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు.. ముందుండేలా చేస్తోంది. ఇక‌, ఉద్యోగుల విష‌యంలోను,.. ఆయ‌న ప్రోత్సాహం చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ప‌నిచేసేవారిని ప్రోత్స‌హిస్తున్నారు. బ‌హుమ‌తులు ఇస్తున్నారు. ఇలా మొత్తంగా.. స‌రిప‌ల్లి కోటి రెడ్డి వెబ్ ప్ర‌పంచంపై త‌న‌దైన శైలిలో ముద్ర వేసి ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: