వైరల్: బైక్ పై పాడు పని చేస్తున్న జంట..విడియో వైరల్..!

Divya
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు పనులు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అటు అబ్బాయిలు ,అమ్మాయిలు ఇద్దరు కూడా రెచ్చిపోయి మరి అసభ్యకరమైన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమంది కేవలం లైక్స్ కోసమే మరిన్ని పాడు పనులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీలోని వికాస్ పూరి ఫ్లై ఓవర్ పై ఒక జంట చేసిన పాడు పనికి నెటిజెన్స్ సైతం తిట్టిపోస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే ఫ్లైఓవర్ మీద ఈ జంట కదులుతున్న బైక్ ని నడుపుతూ ఇద్దరు కూడ ముద్దులు పెట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఆ అమ్మాయి తల దాచుకొని మరి ముద్దులు పెడుతూ ఉండగా..ఇద్దరు కూడా తమ చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి ఏ విధంగా పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా వెళ్లడంతో.. రోడ్డుమీద ప్రయాణిస్తున్న వారికి ప్రమాదాలు జరుగుతాయని ఈ జంట పైన ఫైర్ అవుతున్నారు.. ముఖ్యంగా చట్టం పట్ల భయము లేవని భద్రత పట్ల కూడా చాలా అశ్రద్ధ చూపుతున్నారు ఈ జంట పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

బైక్ పై ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ఈ జంట కు సంబంధించి ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది తిట్టిపోస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తమ జీవితాలను ఇలా ప్రమాదంలోకి పడేసుకుంటున్నారని అలాగే అధికారులు కూడ ఇలాంటివి యువత చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలంటు పలువురి నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలు కూడ గతంలో ఎన్నోసార్లు వైరల్ గా మారడంతో అధికారులు కూడా అలాంటి వారి పైన చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా యువతి యువకులు మారకుండా ఇలాంటి పాడు పనులు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: