కొంత మంది విచిత్రమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేసిన కూడా హాట్ టాపిక్ అవుతాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు.కొన్ని సార్లు మాత్రం మనుషులకు చిరాకు తెప్పిస్తారు.ఇప్పుడు ఓ వ్యక్తి చేసిన పని మాత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. కోడిపుంజు ఉదయాన్నే కూసి.. తన నిద్రకు భంగం కలిగించిందని ఓ డాక్టర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఇండోర్కు చెందిన ఓ క్యాన్సర్ నిపుణుడు తన ఇంటిపక్కనున్న కొడి ఇబ్బంది పెడుతుందంటూ.. పొరుగింటి వారిపై పలాసియా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.
అలోక్ మోడీ అనే క్యాన్సర్ నిపుణుడు పాలసియా ప్రాంతంలో ని గ్రేటర్ కైలాష్ ఆసుపత్రి సమీపంలో ని సిల్వర్ ఎన్క్లేవ్స్లో నివాసం ఉంటున్నాడు. రోజంతా ఆసుపత్రి డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయం లో ఇంటికి వచ్చి నిద్రపోతుంటానని.. ఉదయం వరకు నిద్రలేవనని పోలీసులకు తెలిపాడు. ఈ సమయంలో తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తుందని వివరించాడు.
కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చినట్లు తెలిపాడు. వారు పట్టించుకోకపోవడం.. కోడి తరచూ అరుస్తుండటం తో విసుగుచెంది పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు వెల్లడించాడు. కోడి కూస్తూ.. తన నిద్రకు భంగం కలిగిస్తోందని.. దీనికి కారణం పొరుగింటివారేనంటూ ఫిర్యాదు లో పేర్కొన్నాడు. రోజంతా ఆసుపత్రిలో పని చేసి అలసిపోయి ఇంటికొస్తున్నాని.. విజయన్కు కోడి రోజూ తెల్ల వారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందన్నాడు.అంతే కాదు నాలుగు కుక్కల పై 138 సెక్షన్ కింద కేసు నమోదు చేశాడు..మొత్తానికి ఇది వైరల్ అవుతుంది.