మూడు పాములతో యువకుడి ఆట.. చివరికి ఏమైందంటే?

praveen
సాధారణంగా పాములను చూస్తే ఎవరి వెన్నులో అయినా వణుకు పుడుతుంది. అయితే మనకు కనిపించేది విషం లేని పాము అని తెలిసినప్పటికీ ఎందుకో పాము అనే పదమే అందరినీ భయపెట్టేస్తూ ఉంటుంది. అందుకే విషం ఉన్నా లేకపోయినా పాము కనిపిస్తే అటువైపుగా వెళ్లడానికి మాత్రం అందరూ భయపడుతూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది పాములు పట్టడం ప్రొఫెషన్ గా మార్చుకుని  ఇక పాములు పట్టడం వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది ఒకేసారి చాలా పాములను చుట్టూ పెట్టుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు.

 అయితే ఎంతో అనుభవం ఉండి పామును పట్టుకోవడం లేదా వాటితో ఆటలాడడం ఓకే కానీ ఎలాంటి అనుభవం లేకుండా పాముల జోలికి వెళ్తే మాత్రం జరగకూడనిది జరిగిపోతుంది  అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. నాగు పాములు పడగ విప్పి ఉన్న సమయంలో ఒక యువకుడు వాటితో ఆటలాడాడు. కానీ అందులో ఉన్న ఒక పాము కి చిర్రెత్తి పోయింది. దీంతో బస్ అంటూ మీద దూకేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాజ్ సయ్యద్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్.

 పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇటీవల అతను పాముల ముందు కూర్చుని వాటితో సాహసాలు చేశాడు. పాముల తోకలను పట్టుకుని లాగటం వంటివి కూడా చేశాడు. చేతులు కాళ్లు కదుపుతూ పాములను భయపెడుతూ ఉండగా అంతలోనే అందులో ఒక పాము అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. అతని మోకాలిని కొరికేసింది. దీంతో షాక్ కి గురైన వ్యక్తి వెంటనే పాము లాగేందుకు ప్రయత్నించినప్పటికీ ఎంతకీ విడిచిపెట్టలేదు.. ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంతా నంద ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: