సచిన్ వీడియో షేర్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?
అయితే ఇక పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది వాహనదారులు మాత్రం ఇటీవలి కాలంలో రోడ్డు నిబంధనలు పాటించక పోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇదంతా కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్ల అన్న విషయం తెలిసిందే. అయితే మేము హెల్మెట్ ధరిస్తున్నాము అంటూ చెబుతున్నారు కొంతమంది. కాని కేవలము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించి వెనకాల ఉన్న వ్యక్తిది ప్రాణం కాదు అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.
ఇటీవల కాలంలో వెనుక ఉన్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నోసార్లు పోలీసుల అవగాహన కల్పించగా ఇక ఇప్పుడు ఒక ఆసక్తికర వీడియోని విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వీడియోని షేర్ చేశారు. కార్ లో వెళ్తున్న సచిన్ ను చూసి అభిమానులు వెంట వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బైక్ పై ప్రయాణం చేస్తుండగా వారిని చూసిన సచిన్ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు పోలీసులు.