వావ్:జియో యూజర్లకు శుభవార్త తెలిపిన రిలయన్స్ .!!
దీంతో టవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగాయి.. ఈ సెల్ టవర్ సిగ్నల్స్ ను ఉపయోగించుకొని ఇప్పుడు గ్రామ ప్రజలు హైస్పీడ్..4G సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక విద్యార్థులు కూడా కరోనా సమయం కాబట్టి.. బయట ఎక్కడికి వెళ్లకుండా వారి విద్య ను కొనసాగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక అంతే కాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు, వారి కమ్యూనికేషన్ ని పెంచుకోవడం.. వినోదం పొందడం, వారి యొక్క ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం వంటివి ఇప్పుడు పల్లెలకు కూడా వెళ్లాయి. అందుకోసమే ఈ ఫోర్ జి హై స్పీడ్ సేవలను ప్రజలకు అందిస్తున్నామని అక్కడికి వచ్చిన కొంతమంది jio అధికారులు తెలియజేశారు.
దేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉన్న jio ప్రస్తుతం 4G సేవలను మారుమూల ప్రాంతాలలో తమ సేవలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా తమ జియో ఫోన్ ద్వారా ఎంతో మంది గ్రామీణులు వారి పనులను చేసుకుంటున్నారు.. తమ కస్టమర్లు సైతం ఇలాంటి సేవలను అందించడంలో ముందుంటామని తెలియజేశారు.