వైరల్ : దేవుడిలా వచ్చాడు.. లేదంటే కుక్కలు చంపేసేవి?

praveen
ఇటీవలి కాలంలో ఊర కుక్కలు రెచ్చిపోయి జనాలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.  ఒక చోట గుంపుగా చేరుతున్న వీధి కుక్కలు కనిపించిన వారిపై దాడికి పాల్పడుతూ.. దారుణంగా గాయపరుస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవలికాలంలో వీధికుక్కలు రెచ్చిపోయి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి . ఇలా వీధికుక్కలు దాడులకు పాల్పడిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. అయితే కుక్కలా దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని జాగ్రత్త పడాలి అంటూ సూచిస్తున్నారు అధికారులు.

 ఇకపోతే ఇటీవల ఏకంగా 12 వీధికుక్కలు ఒక బాలుడి పై దారుణంగా దాడి చేసిన ఘటన అందరిని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. అయితే బాలుడి పై దాడి చేస్తున్న సమయంలో తల్లి అడ్డుకునేందుకు వెళ్లగా.. ఇక తల్లిపై కూడా కుక్కలు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అచ్చం ఇలాగే ఇక్కడ మరో ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై కుక్కలు అత్యంత భయానకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయ్. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వెలుగులోకి వచ్చింది.


 భూపాల్ లో నివాసముండే ఒక కూలీ కూతురు ఆరుబయట ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడికి ఒక కుక్కల గుంపు వచ్చింది.. ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికపై ఐదు కుక్కలు కూడా దాడి చేసాయ్. అయితే బాలిక భయంతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టింది. అయినప్పటికీ ఆ కుక్కలు మాత్రం వదలలేదు. ఏకంగా బాలికను వెంబడించి మరీ చుట్టుముట్టి దాడి చేశాయి. దారుణంగా ఎక్కడికక్కడ గాయాలు చేశాయ్. ఈ క్రమంలోనే బాలికకు తల బొట్టు కాళ్లపై గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఇంతలో అటువైపుగా వచ్చిన ఒక వ్యక్తి గమనించడంతో కుక్కలను అక్కడి నుంచి తరిమేశారు. లేకపోయి ఉంటే ఆ బాలిక ప్రాణం పోయేది. దీనికి సంబంధించిన వీడియో కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: