ఉగాది పచ్చడి ఎందుకు తినాలో తెలుసా..?

Divya
మన తెలుగు రాష్ట్రాలలో పాటు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో ఉగాది వేడుక చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఇష్ట దైవాన్ని పూజించుకొని మరి ఉగాది పచ్చడిని ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. ఈ పచ్చడిని రుచి చూశాకే ఆరోజు ఏమైనా ఇతర ఆహారాలను తింటూ ఉంటారు ప్రజలు. ముఖ్యంగా ఆరు రుచుల కలయికతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పచ్చడిలో ఆరు రోజులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తూ ఉంటాయి.

ఈ ఉగాది పచ్చడిలోకి తీపి, కారం ,పులుపు ,ఉప్పు, వగరు, చేదు వంటి కలయికలతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. బెల్లం పచ్చిమిర్చి చింతపండు ఉప్పు మామిడికాయ వేప పువ్వుని ఆనవాయితీగా ఈ పచ్చడిలో తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఆ ఏడాది అంతా కూడా మంచే జరుగుతుందట అదేవిధంగా చేదు తగిలితే కష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తుంటారు. పులుపు తగితే కష్టసుఖాలు కూడా ఉంటాయని ఈ ఉగాది పచ్చడి తయారీలో ఒక ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అలాగే పచ్చడిలో వాడే ప్రతిపదార్థం కూడా మనం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందని ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకొని విధంగా ఈ పచ్చడి మనకి శక్తి అందిస్తుందని కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉంటారు. అయితే పచ్చడి తయారు చేసే విధానం ఎలా..
1). మిరపకాయను బెల్లాన్ని మామిడికాయను బాగా తురుముకోవాలి..
2). వీటి కంటే ముందు చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి.
3). చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి
4). ఇక వేప పువ్వును బాగా కడిగి పొడి భారేలా నూరాలి.
5). చింతపండు నీళ్లలో ఉప్పు మామిడి తురుము బెల్లం తురుము పచ్చిమిర్చి వేప తురుము ఇలా అన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు అరటిపండు ముక్కలు జామ మొక్కలు కూడా కలుపుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: