ఏపీ ఉద్యోగులకు.. రిటైర్మెంట్ వయసు పెరిగిందా.. క్లారిటీ ఇదే..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ మధ్యకాలంలో పలు విధాలుగా కొంతమంది రాజకీయ నాయకులు కావాలని దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. అలా తాజాగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 62 సంవత్సరాల నుంచి 65 ఏళ్లకు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతూ ఉన్నట్లుగా ఒక ఫేక్ నోటిని విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ఒక మీడియా వార్త హల్చల్ చేసింది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 60 ఏళ్లుగా ఉన్న ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు.. 62 కు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగం పదవీ విరమణ వయసు మళ్లీ మూడు సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక జీవో ని నవంబర్ 15న శనివారం రోజున ప్రభుత్వం జారీ చేసిందని ఒక ఫేక్ జీవో లెటర్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అధికారులు ఈ ఫేక్ జీవో పైన గుంటూరు రేంజ్ డీజీపీ అధికారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ కేసు పైన విచారణ చేపట్టాలని ఎస్పీని డిఐజీ కి ఆదేశించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి

అయితే ఎట్టకేలకు మాత్రం అధికారులు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడంతో ఎలాంటి ఉద్యోగులకు వయసు పెంచలేదని విషయంపై అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో అధికారంలో ఉన్న పార్టీని.. కావాలని ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టిస్తోంది ప్రతిపక్ష పార్టీలు అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగాల సంఘానికి అధ్యక్షుడు అయిన సూర్యనారాయణ కొంతమంది నాయకులతో కలిసి గవర్నర్ హరిచంద్రను కలిసి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు రావలసిన పదివేల కోట్ల బకాయిలు ఇప్పించేలా జోక్యం చేసుకోవాలంటే కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: