నన్ను వదలొద్దు అంటున్న దొంగ.. ఎందుకో మీరే చూడండి?
అయితే ఇక్కడ ఒక దొంగ ఇలాగే చేయబోయాడు. రైలు కదులుతున్న సమయంలో కిటికీలోనుంచి చేతులు పెట్టి సెల్ఫోన్ చోరీ చేయడానికి చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయాణికుడు అప్రమత్తం కావడంతో చివరికి ఆ దొంగ ప్రాణాల మీదికి వచ్చింది. కొన్ని నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ఎవరైనా దొంగ చోరీ చేస్తూ పట్టుబడిన సమయంలో ప్లీజ్ వదిలేయండి అని బ్రతిమిలాడుతాడు. కానీ ఇక్కడ మాత్రం నన్ను వదిలి పెట్టొద్దు అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు.
బీహార్లోని బెగుసరాయ్ నుంచి ఖాగారియా కి వెళ్తున్న రైలు సాహెబ్ పూర్ కమల్ స్టేషన్ దగ్గర ఆగింది. కాసేపటికి రైలు మళ్ళీ స్టార్ట్ అయింది. వెంటనే ఒక దొంగ రైలు కిటికీ నుంచి ప్రయాణికుడి ఫోన్ ఫోన్ చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు దొంగ చేతులు గట్టిగా పట్టుకున్నాడు. రైలు వేగం పెరిగింది. ఇక ప్రయాణికులు మాత్రం ఆ దొంగను అలాగే పట్టుకున్నారు. దీంతో రైలు తో పాటే వేలాడుతూ వచ్చాడు. దీంతో తనను వదిలి పెట్టవద్దని తన ప్రాణాలను కాపాడాలి అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు దొంగ. దీంతో ఇక దొంగతనానికి ప్రయత్నించి చివరికి రైలు బయట వేలాడుతూ నరకయాతన అనుభవించాడు.