అయ్యో పాపం.. సినిమా ఎంత పని చేసింది?

Satvika
సినిమా అంటే పిచ్చి ఉండాలి.. కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునె అంత పిచ్చి మాత్రం ఉండకూడదు.. ఈరోజుల్లో జనాలు మాత్రం తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే భారీ ఫ్లెక్సీలు,పాలాభిషేకాలు ఇలా ఒకటేమిటి సినిమా వచ్చి వెళ్ళే వరకూ అన్నీ చేస్తారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. అలా చాలా మంది ప్రాణాలును కూడా పొగొట్టుకున్నారు. అయిన జనాల్లొ సినిమా పిచ్చి మారలేదు. ఇప్పుడు ఓ వ్యక్తి సినిమా ఫ్లెక్సీ పెడుతూ కరెంట్ షాక్ తగలడంతో ప్రానాలను పొగొట్టుకున్నారు...

ఈరోజు భారీ అంచనాల తో రెబల్ స్టార్ నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా హాల్లను ముస్తాబు చేసి సినిమాను ఎప్పటిలాగే ఆహ్వానిస్తారు. ఆ క్రమంలో ఊరంతా కూడా భారీ ఫ్లెక్సీల తో నింపెస్తారు..ఇలా చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి ప్రాణాలును కొల్పొయారు.. అభిమాన హీరో సినిమా విడుదల రోజు ఇలా జరగడం పై డార్లింగ్  ఫ్యాన్స్ నిరాశ లో ఉన్నారు. అంతేకాదు తన కుటుంబానికి అన్నీ విధాలుగా ఆదుకుంటామని చెప్పడం విశేషం..

విషయాన్నికొస్తే.. ఈ ఘటన గుంటూరు లో వెలుగు చూసింది.రాధేశ్యామ్ సినిమాకు ముందు జిల్లాలో విషాదం నెలకొంది..కారంపూడి పట్టణంలోని ఐమాక్స్ థియేటర్ ముందు అభిమానులు భారీ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ విరిగి పోయింది. అది పక్కనే ఉన్న కరెంట్ తీగల పై పడింది. షాక్ కొట్టింది. దాంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలు కావడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు.కోటి అనే సెంట్రింగ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలున్నట్లు తెలుస్తోంది. అయితే అతని కుటుంబాన్ని అన్నీ విధాలుగా ఆదుకుంటామని ప్రభాస్ ఫ్యాన్స్ భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: