ఇండియాలో స్మార్ట్ ఫోన్ వాడకం చాలా వేగంగా పెరిగింది. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా అన్ని కంపెనీలు కూడా వివిధ రకాల అప్డేటెడ్ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాయి.కచ్చితంగా ప్రతి కంపెనీ కూడా నెలలో ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యేలా చూసుకుంటుంది. ఇండియన్ మార్కెట్లో వివో కంపెనీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ అనేది ఉంది.ఈ మధ్య కాలంలో వివిధ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో వివో కంపెనీ సేల్స్ పరంగా కొంతమేర వెనుకబడిది. అయితే తాజాగా వివో వై 27 పేరుతో మళ్లీ ఇండియన్ మార్కెట్లో మరో కొత్త ఫోన్ను రిలీజ్ చేసింది.ముఖ్యంగా చార్జింగ్ విషయంలో వినియోగదారలకు సపోర్ట్ ఇస్తూ ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకువస్తుంది. ఈ వివో వై-27 లాంచ్తో దాని వై-సిరీస్కి కొత్త స్మార్ట్ఫోన్ను యాడ్ చేసింది. ఇంకా ఈ స్మార్ట్ఫోన్ గ్లాస్ బాడీని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది.ఇంకా మీడియాటెక్ చిప్సెట్తో పని చేసే ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్, గార్డెన్ గ్రీన్ రంగుల్లో ఉండే ఈ స్మార్ట్ఫోన్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా వివో ఇండియా ఈ-స్టోర్లో మనకు అందుబాటులో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక వివో వై 27 ఫీచర్ల విషయానికి వస్తే..ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం 1080×2388 పిక్సెల్ రిజల్యూషన్తో 6.64 అంగుళాల పూర్తి హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది.ఇంకా అలాగే 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశాన్ని 600 నిట్ల దాకా అందిస్తుంది.ఇక 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో వచ్చే ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియక్ష జీ 85 ప్రాసెసర్తో పనిచేస్తుంది.ఈ స్మార్ట్ఫోన్ 6 జీబీ దాకా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ మెమరీని మైక్రో ఎస్డీ కార్డ్ని యాడ్ చెయ్యడం ద్వారా మరింత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 50 ఎంపీ ప్రధాన సెన్సార్తో డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది.ఇంకా అలాగే సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.ఇక సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.