ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది.ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను దేశావ్యాప్తంగా విస్తరించేందుకు కంకణం కట్టుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యం. అందులో భాగంగా కేంద్రం ముందడుగులు వేస్తుంది.ఇక రైల్వే శాఖ ఎలక్ట్రిక్ వాహనదారులకు మంచి శుభవార్త తెలిపింది. రైల్వే ప్రాంగణాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను ప్రజల కోసం అందుబాటులోకి తెస్తోంది.అందులో భాగంగా ఇక ఫేజ్1లో తొలి స్టేషన్ను హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేసింది. ఇక త్వరలోనే నగరంలో మరిన్ని స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు అనేవి కూడా ఎక్కువగా ఏర్పాటు చేయనుంది.ఇక ఈ పర్యావరణ హితమైన ఈవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈవీ కార్లు, స్కూటర్లు ఇంకా అలాగే బైకులు కొన్న వారికి ప్రత్యేక రాయితీలు ఇంకా అలాగే ప్రోత్సహాకాలు కేంద్ర ఇంకా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందిస్తున్నాయి. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్లు అనేవి అసలు విరివిగా లేకపోవడం అనేది పెద్ద లోపంగా మారింది. దీంతో ప్రభుత్వ ఇంకా అలాగే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఇంకా అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ జోన్లో ఫస్ట్ ఫేజ్లో మొత్తం 32 స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇందులో మొదటి స్టేషన్ నాంపల్లిలో కూడా ప్రారంభం అయ్యింది. ఇక ఇది కాకుండా హైదరాబాద్ నగర పరిధిలో బేగంపేట, హైటెక్సిటీ, ఘట్కేసర్, లక్డీకాపూల్, ఫతేనగర్, నెక్లస్రోడ్ ఇంకా అలాగే సంజీవయ్య పార్కు స్టేషన్లలో కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.ఇక తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వరంగల్ ఇంకా కాజీపేట ఇంకా మహబూబాబాద్ ఇంకా డోర్నకల్ ఇంకా మధిర ఇంకా అలాగే భద్రాచలంరోడ్ ఇంకా అలాగే భువనగిరి మరియు జనగామ అలాగే జమ్మికుంట ఇంకా పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్ ఇంకా అలాగే కరీంనగర్ స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.