కార్ మైలేజ్ ని పెంచే ఈజీ టిప్స్.. ఫాలో అవ్వండి!

ఇండియాలో వినియోగదారులు ధరతో పాటు మైలేజికీ కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ప్రస్తుతం బీఎస్4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా వాహన సంస్థలు అనేక మార్పులను చేస్తున్నాయి.ఇక ఈ నేపథ్యంలో బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ని కూడా తయారుచేస్తున్నాయి. అయితే కొన్ని పద్దతులను పాటించడం ద్వారా కారు మైలేజీని మీరు పెంచుకోవచ్చు.మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఏసీ ఆన్‌లో ఉంటే మైలేజీ బాగా దెబ్బతింటుంది. మీరు ఈ అలవాటును వదులుకోవాలి ఎందుకంటే AC ని రన్ చేయడం వల్ల కారు మైలేజీ అనేది 30 శాతం దాకా తగ్గుతుంది. నివేదికల ప్రకారం మీరు ఫుల్ ట్యాంక్ ఇంధనంతో AC ఆన్‌లో పెట్టుకొని 500 కి.మీ గనుక ప్రయాణిస్తే AC ఆఫ్ చేయడం ద్వారా 600 నుంచి 625 కి.మీ మీరు ప్రయాణించవచ్చు.అలాగే కారు పనితీరుకు రెగ్యులర్ సర్వీస్ అనేది చాలా అవసరం. ఇది మంచి మైలేజ్‌ ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంకా అలాగే ఫ్యూయల్ ఫిల్టర్ మీ కారు ఇంధన మైలేజీని బాగా పెంచుతాయి. ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ కనుక సరిగ్గా లేకుంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తుంచుకోండి.


అలాగే మీ కారులో ఎక్కువ ఇంధనం ఉంటే కారు మైలేజ్ తగ్గుతుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం అని చెప్పాలి. నిజానికి కారుపై ఎక్కువ లోడ్ ఉంటే ఇంధన వినియోగం బాగా పెరుగుతుంది. అందుకే సగం నిండిన ట్యాంక్ కారు మైలేజీని బాగా పెంచుతుంది.అలాగే మితిమీరిన వేగం, అనవసరమైన యాక్సిలరేషన్ ఇంకా అలాగే అసందర్భ బ్రేకింగ్‌లను తగ్గించుకోగలిగినట్లయితే, ఇంధన వినియోగం అనేది బాగా తగ్గి మైలేజ్ అనేది కూడా బాగా పెరుగుతుంది. హైవేలపై ఎక్కువ వేగంతో వెళ్లటం వలన సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ను కోల్పోవటం కూడా జరుగుతుంది. అలాగే, సిటీ రోడ్లపై అనవసర బ్రేకింగ్ ఇంకా అలాగే యాక్సిలరేషన్ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది.అలాగే అన్ని టైర్లలో కూడా గాలి పీడనం అనేది అసలు సరిగ్గా ఉందో లేదో బయలుదేరే ముందే చూసుకోవాలి. టైర్లలో నిర్దేశిత మోతాదు కన్నా తక్కువ గాలి కనుక ఉన్నట్లయితే, రన్నింగ్ లోడ్ పెరిగి మైలేజ్ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: