యూజర్ సేఫ్టీ కోసం 95 కోట్లు ఖర్చు పెట్టిన ఫేస్ బుక్..

ప్రముఖ టెక్‌ దిగ్గజం సోషల్ మీడియా సైట్ అయిన ఫేస్‌బుక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ రోజుల్లో ఫేస్ బుక్ వాడని వ్యక్తి అంటూ లేడు.ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది ఫేస్ బుక్ ని వాడుతున్నారు.అంత బాగా ప్రజాదరణ పొందింది ఫేస్ బుక్.ఫేస్ బుక్ వల్ల చాలా మంచి ప్రయోజనాలు వున్నాయి. ఇంకా అలాగే చెడు ప్రయోజనాలు కూడా వున్నాయి.ఇక అలాగే గత కొన్ని రోజుల క్రితం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆరోపణలు చేసిన సంగతి అనేది తెలిసిందే.వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదికను తప్పుబడుతూ ఫేస్‌బుక్‌ ఘాటుగా సమాధానమివ్వడం జరుగుతుంది. ఇక కొంత మంది వ్యక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌పై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ చేసిన ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టడం జరిగింది.ఇక ప్రతి యూజర్‌ను తమ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తామని ఫేస్‌బుక్‌ పేర్కొనడం జరిగింది.

ఇక ఫేస్ బుక్ యూజర్‌ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని 2016 నుంచి సుమారు 13 బిలియన్‌ డాలర్లను అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 95, 830 కోట్లు ఖర్చు చేసిందని ఫేస్‌బుక్‌ వెల్లడించడం జరిగింది.ఫేస్ బుక్ యూజర్ల సెక్యూరిటీ కోసం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య పదివేల నుంచి 40 వేల దాకా పెరిగిందని పేర్కొనడం జరిగింది. ఇక అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను కూడా ఉపయోగించి సుమారు 3 బిలియన్ల నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను తీసేసినట్లు తెలిపడం జరిగింది.ఇక అలాగే కోవిడ్‌-19 మహమ్మారీ విజృంభిస్తున్న సమయంలో కూడా ఫేక్‌ సమాచారాన్ని ఎక్కువగా సర్క్యూలేట్‌ అవ్వకుండా చూశామని ఫేస్‌బుక్‌ వెల్లడించడం జరిగింది. అలాగే సుమారు 20 మిలియన్ల తప్పడు వార్తలను కూడా అరికట్టామని ఫేస్‌బుక్‌ తెలిపడం జరిగింది. ఇమేజ్-షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలను ఇంకా ప్రమాణాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను కూడా గతంలో కంటే15 రెట్లు ఎక్కువగా తొలగిస్తున్నామని పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: