స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే జరా ఆగండి!
యువత ఇలాంటి స్మార్ట్ఫోన్లను కొనడానికి ఎంత డబ్బు అయినా పెట్టడానికి వెనకాడటం లేదు. ఇక కంపెనీలు ఇదే తడవుగా వేలకు వేలు స్వాహా చేస్తున్నాయి. ఇంత స్మార్ట్ టెక్నాలజీతో మన ముందుకు వస్తున్న స్మార్ట్ఫోన్లు ఇకపై చార్జీలను ఇవ్వబోమని నిర్ణయించుకున్నాయి. అందుకు కారణం పర్యావరణమే అని సూచిస్తున్నాయి,సాధారణంగా మొబైల్ ఫోన్ కొంటే దానితోపాటు చార్జర్, హెడ్ సెట్ ఉచితంగా ఇచ్చేవి. గత కొద్ది కాలం నుండి హెడ్ సెట్ ను ఇవ్వడం పూర్తిగా మానేసాయి అన్ని కంపెనీలు.
ఇప్పుడు మరోసారి ఛార్జర్లు కూడా ఇవ్వబోమని ప్రకటిస్తున్నాయి. అయితే ఫోన్కు చార్జర్ ఇవ్వకపోతే ఏ విధంగా చార్జ్ చేసుకోవాలని అందరూ ఆలోచనలో పడ్డారు.ఇదిలా ఉండగా గత సంవత్సరం ఆపిల్ కంపెనీ ఐఫోన్ 12 మొబైల్ కు చార్జర్ ఇవ్వడం మానేసిందని మనందరికీ తెలుసు.ఇప్పుడు అన్ని కంపెనీలు కలిసి మొబైల్ చార్జర్ ను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. ఇకపై ఎలాంటి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకున్నప్పటికీ మనకు కేవలం బాక్సులో మొబైల్ మాత్రమే దొరుకుతుంది.
మొబైల్ చార్జర్ పక్కన విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్తో చార్జర్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడిగినప్పుడు కంపెనీలు పర్యావరణ కారణమని చెప్పడం,ఇంతవరకు దీనికి సరైన సమాధానం ఎవ్వరికీ దొరకలేదు. ఒకవేళ ఏదైనా అడిగినప్పుడు కంపెనీలు మాత్రం పర్యావరణ సంరక్షణ కోసమే మొబైల్ చార్జర్ ఇవ్వడంలేదని చెబుతున్నాయి
ఇకపై మీరు ఎలాంటి మొబైల్ కొన్నప్పటికీ చార్జర్ విడిగా కొనక తప్పదు.