టివి: ఈ సీరియల్ యాక్టర్ భర్త అంత పెద్ద డైరెక్టరా..?

Divya
తెలుగు సినీ పరిశ్రమలో అటు సినిమాలలో సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు సైతం చాలా మంది దర్శకులను ఆర్టిస్టులను ప్రేమించి మరి వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు. అయితే అందులో కొంతమంది నటీమణులు సైతం బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి పలు సీరియల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాము. మరి కొంత మంది తమ పర్సనల్ లైఫ్ ని చాలా రహస్యంగా ఉంచుతారు. అలాంటి వారిలో నటి మీనా కుమారి కూడా ఒకరు.. సీరియల్స్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ముఖ్యంగా మీనా కుమారి భర్త కూడా ప్రముఖ డైరెక్టర్ అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. చి ల.సౌ స్రవంతి సీరియల్ ద్వారా మీనా కుమారి బాగా క్రేజీ సంపాదించుకుంది. అప్పట్లో ఈ సీరియల్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అలా సీరియల్స్ లో ఆకట్టుకున్న మీనా కుమారి ఆ తర్వాత సినిమాలలో కూడా నటించింది. సీరియల్స్ లో ఆర్టిస్టుగా రాణిస్తున్న సమయంలోనే తన మొదటి సీరియల్ ఆయన డైరెక్టర్ పులి వాసులతో ప్రేమలో పడి కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

పులి వాసు శ్రీమతి కళ్యాణ, మంచు పల్లకి, చి ల సౌ స్రవంతి వంటి సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించారు. ఇక చిరంజీవి చిన్న అల్లుడు నటించిన కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి అనే సినిమాని తీశారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న మరొకవైపు నటుడిగా కూడా తన మార్కును సైతం చూపించే ప్రయత్నం కూడా చేశారట పులి వాసు. సంకల్పం, సుబ్బు తదితర చిత్రాలలో కూడా నటించినట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ పులి రూపాయి అనే సినిమాతో హీరోగా కూడా మారారు. ప్రస్తుతం మరొక సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు పులి వాసు.. ప్రస్తుతం ఈయన డైరెక్షన్ వైపే ఎక్కువగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: