TV: టాలీవుడ్ యాంకర్స్ ఎంతవరకు చదువుకున్నారో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో చదువుతో సంబంధం లేకుండా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సినీ పరిశ్రమ కూడా ఒకటి. కొంతమంది బుల్లితెరపై సత్తా చాటితే మరికొంతమంది వెండితెరపై సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై ఇప్పుడు ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ ఇందులో చాలామంది తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ , రష్మీ , శ్రీముఖి, సుదీర్ , ప్రదీప్ ఇలా ఎంతోమంది యాంకర్లు తమ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే వీరి యొక్క అభిమానులకు కూడా వీరు ఎంతవరకు చదువుకున్నారు అన్న విషయం తెలియకపోవచ్చు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
సుమ: బుల్లితెర యాంకరింగ్ రంగంలో మకుటం లేని మహారాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సినిమాలలో కూడా నటిస్తోంది . సుమ విద్యార్హత విషయానికి వస్తే M.Com పూర్తి చేసింది.
ఝాన్సీ: ఒకప్పుడు యాంకర్ గా సత్తా చాటిన ఈమె ఆ తర్వాత వెండితెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఈమె బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
అనసూయ: గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని యాంకర్ గా దూసుకుపోతున్న ఈమె సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తోంది. ఇక అనసూయ ఎంబీఏ పూర్తి చేసింది.
సుధీర్: బుల్లితెరపై కమెడియన్గా , ఆ తర్వాత యాంకర్ గా,  ఇప్పుడు హీరోగా మారి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుధీర్ ఇంటర్ తోనే చదువు ఆపేశారు.
ప్రదీప్: మేల్ యాంకర్లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ప్రదీప్ హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు.  ఇక పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన ఈయన బీటెక్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్   పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: