టీవీ: మంచు కొండల్లో చిల్ అవుతున్న సుధీర్..!

Divya
మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా రామోజీ ఫిలిం సిటీ లో అవకాశం అందుకొని ఆ తర్వాత వేణు సహాయంతో జబర్దస్త్ లోకి స్క్రిప్ట్ రైటర్ గా అడుగుపెట్టిన సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ తర్వాత తన కామెడీతో ప్రేక్షకులను అలరించి అతి తక్కువ సమయంలో టీం లీడర్ గా పేరు సంపాదించుకొని సుడిగాలి సుదీర్ గా పేరు సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు షోలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు ఇటీవల జబర్దస్త్ షో నుంచి దూరం అయ్యి స్టార్ మా చానల్లో అధిక పారితోషకంకోసం అక్కడికి షిఫ్ట్ అయిన ఈయన మళ్లీ జబర్దస్త్ లో అడుగుపెట్టలేదు..
ఆ తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టిన సుడిగాలి సుదీర్.. సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.  అయితే గత ఏడాది గాలోడు సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అంతర్జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న వేణు ఎల్దండి, తన స్నేహితుడు గెటప్ శ్రీను లతో కలిసితో ఆయన మంచు కొండల్లో విహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ ముగ్గురు మంచు కొండల్లో విహరిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. అంతేకాదు ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని సుదీర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా పిచ్చి ఎప్పటికీ మారదు అంటూ రాసుకు వచ్చాడు .సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి మొత్తానికి అయితే ఈ ఫోటోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు రష్మీ కూడా ఎక్కడ భయ్యా అంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా మారింది మొత్తానికైతే వీళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది . ఏది సుధీర్ మళ్లీ ఒక సినిమాతో హిట్టు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: