టీవీ: స్టేజ్ పైనే ఇమ్మానుయేల్ పరువు తీసిన రష్మీ..!

Divya
ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో తాజాగా మల్లెమాల విడుదల చేయగా అందులో జడ్జిలుగా హీరోయిన్ ఖుష్బూ , సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ వ్యవహరిస్తున్నారు. ఈ షోకి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తోంది తాజాగా లేటెస్ట్ ప్రోమోనో విడుదల చేయగా ఇందులో వేసిన పంచు చాలా వైరల్ గా మారుతుంది.. బుల్లెట్ భాస్కర్ టీము ఈసారి మెగాస్టార్ ఇంద్ర సినిమా స్పూఫ్ చేయడం జరిగింది.. చిరంజీవి క్యారెక్టర్ లో ఆవేశం స్టార్ ఎంట్రీ ఇచ్చి .. ఆర్తి అగర్వాల్ గా వర్షాను కనిపించారు . నాలో ఏం నచ్చింది అని ఆవేశం స్టార్ అడగగా... నిన్ను చూడగానే చిరుత పులి లాంటి నీ కళ్ళు నన్ను ఆకర్షించాయి అంటూ వర్షా చెబుతుంది..
ఇదంతా చూస్తున్న ఇమ్ము డైరెక్టర్ ఏం చేస్తున్నావ్ శ్రీకాకుళం ట్రాక్టర్ పైన ఈవెంట్ చేస్తున్నాయి అంటూ వచ్చిరాని తెలుగులో కౌంటర్ ఇచ్చాడు.. డైరెక్టర్ క్యారెక్టర్ పోషించిన బుల్లెట్ భాస్కర్.. సినిమా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది 200 కోట్లు నాలుగు బావులు కూడా కొంటున్నారు దుబాయిలో అదేదో ఉంటుంది కదా ఏంటది అని ఇమ్ముని అడుగుతాడు వెంటనే అంటాడు అప్పుడు ఇది చూశారా అని వర్షా వైపు చూపించగా ఇది మియా కలీఫా అని సమాధానం చెబుతాడు.
వెంటనే రష్మీ ఇమ్ము మియా కలీఫా వీడియోలు చాలా చూస్తున్నట్లు ఉన్నావు కదా నువ్వు అంటూ పరువు తీసింది కవర్ చేయడానికి ఇమ్మానియేల్ నేను సబ్స్క్రైబ్ అంటూ చెప్పాడు దీంతో సెట్ మొత్తం ఒక్కసారిగా పగలబడి నవ్వేసింది. ఆ తర్వాత ప్రోమోలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత స్కిట్లను కూడా చూపించడం జరిగింది ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో నెట్ ఉంటే చాలా వైరల్ గా మారుతుండగా మరి కొంతమంది జోర్దార్ సుజాత రాకేష్ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. తర్వాత కెవ్వు కార్తిక్ స్కిట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: