టీవీ: ఈ జబర్దస్త్ కమెడియన్లలలో ఎక్కువ పారితోషకం ఎవరికంటే..?

Divya
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.ఈ జబర్దస్త్ షో లో ప్రేమ జంటగా పేరుపొందారు సుధీర్ ,రష్మీ. ఆ తర్వాత అంత క్రేజీని మళ్లీ అందుకున్న వారిలో జబర్దస్త్ వర్ష, ఇమ్మానుయేల్ కూడా ఒకరు. ఇక వీరు చేస్తున్న సందడి అంతా ఎంత కాదు. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రేక్షకులంతా భావించేలా మల్లెమాల సంస్థ చేసింది.కానీ వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అంటూ వీరి సన్నిహితులు తెలియజేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కూడా చెడిపోయిందని కేవలం కార్యక్రమాల కోసమే వీరు కలిసి ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అతి త్వరలోనే వీరిద్దరూ వేరు వేరు గా వివాహం చేసుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇమ్మానియేల్ కంటే వర్షకి రోజుకి పారితోషకం ఎక్కువగా అంటూ ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు వీరిద్దరి జంటను తెగ అభినందించడంతో వీరు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలలో కనిపించే అవకాశం ఉంటుంది. అయితే పారితోషక విషయంలో వీరిద్దరికి ఎక్కువ వ్యత్యాసం ఉండకపోవచ్చు.. రూ. లక్ష నుంచీ.. రూ.1.50 లక్ష దాకా వర్ష రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం.

ఇక ఇమ్మానుయేల్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. రూ. 80 వేల నుంచి రూ. 1.30 లక్ష దాకా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి జోడి కి పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరూ ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో వర్ష, ఇమ్మానియేల్ మరిన్ని చిత్రాలలో  కూడా నటించాలని కోరుకుందాం. ప్రస్తుతం వీరి చేతిలో జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇమ్మానియేల్ కంటే వర్ష నే అధిక రేమ్యునరేషన్ అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: