టీవీ: ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి..!!

Divya
ఈ మధ్యకాలంలో వరుసగా పలు సినీ ఇండస్ట్రీలో విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఒక సీరియల్ నటి తునిషా శర్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన ఒక్కసారిగా అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఈమె నటిస్తున్న సీరియల్ సెట్టులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయం ఇంకా తెలియడం లేదు.

ప్రస్తుతం ఈమె వయసు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరియర్ను మొదలుపెట్టిన తునిషా శర్మ భారత వీరపుత్ర ,మహారాణా ప్రతాప్ టీవీ సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చింది.  తునిషా ను  సెట్లో  చూసినా ఉన్న వ్యక్తులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఆమె మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టం  కోసం ఆసుపత్రికి తరలించారు తునిష మరణంతో ఇండస్ట్రీలో పలు విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం తునిషా SAB టీవీ సీరియల్ ఆలీబాబా దస్తాన్ ఏ కాబుల్లో మహారాణి యూరిన్ పాత్రను పోషిస్తుంది.

తునిషా చిత్తూర్ బార్ బార్ దేఖో.. కహాని టు దుర్గారాణి సింగ్, దబాంగ్-3  వంటి చిత్రాలలో కూడా నటించింది. తుని షాపితూర్, బార్ బార్ దేకోలో కత్రినా కైఫ్ యుక్త వయసులో ఉండే పాత్రను పోషించింది. కలర్స్ టీవీలో ఇమే నటించిన ఇంటర్నెట్ వాళ్ళ, లవ్ సిరియల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తునిషా శర్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండేదని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటూ సెట్లో అందరితో కలిసిపోయే మాట్లాడే తునిషా ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు కొంతకాలం క్రితం టీవీ నటి వైశాలి టక్కర్ కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: