టీవీ: రష్మీ కి హీరోయిన్ గా మొదటి అవకాశం ఆలా వచ్చిందా..!!
అసలు విషయంలోకి వెళ్తే రష్మీ మొదట హోలీ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ప్రస్థానం గణేష్ , బిందాస్ , కరెంట్ తదితర చిత్రాలలో కూడా చిన్నచిన్న పాత్రలలో నటించింది. కానీ మొదట తమిళ్లో కందేన్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రష్మి. ఈ ఆఫర్ రావడానికి ముఖ్య కారణం నటి సంగీతానేనట. తెలుగులో పలు చిత్రాలను నటించిన ఈమె ఇక్కడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సంగీత. అలా ఒక రియాలిటీ షోలో రష్మి ని చూసి రష్మీ గురించి తమిళ్ డైరెక్టర్ ముగిల్ కి తెలియజేసిందట.
అలా తను నటించబోతున్న కందేన్ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. శాంతాను భాగ్యరాజ్ , సంతానం , రష్మీ ఇందులో కీలకమైన పాత్రలో నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నటన పరంగా రష్మీకి మంచి మార్కులు పడ్డాయి. అటు తరువాత తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన రష్మీ. చివరిగా బొమ్మ బ్లాక్ బాస్టర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.